అక్రమ కట్టడం పై మున్సిపల్ అధికారుల ఉక్కు పాదం

  • ఐదు అంతస్తుల కట్టడం నేలమట్టం

ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారిలో సర్వేనెంబర్ 42 లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల అక్రమ కట్టడాన్ని గురువారం నస్పూర్ మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాజకీయ పలుకుబడితో ఓ సింగరేణి కార్మిక సంఘం నాయకుడు సర్వే నంబర్ 40 పత్రాలతో మున్సిపల్ అనుమతి తీసుకొని సర్వేనెంబర్ 42లో ఐదు అంతస్థుల నిర్మాణం చేపట్టడంతో అక్రమ కట్టడం పై మున్సిపల్ అధికారుల ఉక్కు పాదం మోపారు. బిల్డింగ్ యజమానికి మున్సిపల్ అధికారులు 2022 నుంచి పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మరోసారి ముందస్తు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో రెవెన్యూ, పోలీసుల సహకారంతో జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేత కొనసాగుతున్న సమయంలో తమ బిల్డింగ్ ను ఎందుకు కూలుస్తున్నారని, కోర్టులో కేసు ఉందని పోలీసులతో వాగ్వివాదం చేశారు. అక్రమ కట్టడాన్ని అధికారులు కూలుస్తున్నారనే వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ కట్టడాన్ని కూలుస్తున్న ప్రాంతానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న వార్తలు టీవీలో చూసిన జనం, ఇదే విధంగా జిల్లాలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించి, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు అంటున్నారు. ఈ కూల్చివేతల్లో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

అక్రమ కట్టడం పై మున్సిపల్ అధికారుల ఉక్కు పాదం

  • ఐదు అంతస్తుల కట్టడం నేలమట్టం

ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారిలో సర్వేనెంబర్ 42 లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల అక్రమ కట్టడాన్ని గురువారం నస్పూర్ మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాజకీయ పలుకుబడితో ఓ సింగరేణి కార్మిక సంఘం నాయకుడు సర్వే నంబర్ 40 పత్రాలతో మున్సిపల్ అనుమతి తీసుకొని సర్వేనెంబర్ 42లో ఐదు అంతస్థుల నిర్మాణం చేపట్టడంతో అక్రమ కట్టడం పై మున్సిపల్ అధికారుల ఉక్కు పాదం మోపారు. బిల్డింగ్ యజమానికి మున్సిపల్ అధికారులు 2022 నుంచి పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మరోసారి ముందస్తు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో రెవెన్యూ, పోలీసుల సహకారంతో జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేత కొనసాగుతున్న సమయంలో తమ బిల్డింగ్ ను ఎందుకు కూలుస్తున్నారని, కోర్టులో కేసు ఉందని పోలీసులతో వాగ్వివాదం చేశారు. అక్రమ కట్టడాన్ని అధికారులు కూలుస్తున్నారనే వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ కట్టడాన్ని కూలుస్తున్న ప్రాంతానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న వార్తలు టీవీలో చూసిన జనం, ఇదే విధంగా జిల్లాలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించి, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు అంటున్నారు. ఈ కూల్చివేతల్లో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment