అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

నస్పూర్ మండలంలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలతో పాటు ఐ.సి.ఎస్.సి బోర్డ్ ఆఫ్ ఢిల్లీ పేరుతో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న సెయింట్ మేరీస్ ప్లే స్కూల్ పై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని టి.బి.ఎస్.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. పాఠశాల నడుస్తున్న సమయంలో బిల్డింగ్ నిర్మాణ పనులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ లో గల నెక్స్ట్ జనరేషన్ స్కూల్ 60 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఉందని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అగ్నిమాపక అనుమతులు, ఆట స్థలం లేవని, చీకటి గదుల్లో విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. పద్మశాలి కాలనీలోని ఎస్ఆర్ డిజి స్కూల్ ఆన్ లైన్ లో స్కూల్ యూనిఫామ్, టీ షర్ట్స్, స్టేషనరీ తీసుకోవాలని ఒక యాప్ క్రియేట్ చేసి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్నారన్నారు. సంబంధిత పాఠశాలల పై తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

నస్పూర్ మండలంలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలతో పాటు ఐ.సి.ఎస్.సి బోర్డ్ ఆఫ్ ఢిల్లీ పేరుతో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న సెయింట్ మేరీస్ ప్లే స్కూల్ పై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని టి.బి.ఎస్.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. పాఠశాల నడుస్తున్న సమయంలో బిల్డింగ్ నిర్మాణ పనులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ లో గల నెక్స్ట్ జనరేషన్ స్కూల్ 60 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఉందని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అగ్నిమాపక అనుమతులు, ఆట స్థలం లేవని, చీకటి గదుల్లో విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. పద్మశాలి కాలనీలోని ఎస్ఆర్ డిజి స్కూల్ ఆన్ లైన్ లో స్కూల్ యూనిఫామ్, టీ షర్ట్స్, స్టేషనరీ తీసుకోవాలని ఒక యాప్ క్రియేట్ చేసి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్నారన్నారు. సంబంధిత పాఠశాలల పై తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment