- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఆర్. కె న్యూస్: మంత్రి పదవి విషయంలో తనకు అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధమేనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో మంత్రి పదవి తనకు కాకుండా పార్టీ ఫిరాయింపు వలసవాదులకు ఇస్తే ఉమ్మడి ప్రజల గొంతు కోసినట్లేనని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న తనకు అన్యాయం చేస్తారా అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. మంచిర్యాల పోరాటాల గడ్డ అన్యాయం జరిగితే ఉద్యమిస్తారని అన్నారు. బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీల చుట్టూ తిరిగిన వారిని అందలం ఎక్కించవద్దని కోరారు.