అభివృద్ధి విషయంలో రాజీ పడను

* సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత
* మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను రాజీ పడపోనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తేల్చి చెప్పారు. బుధవారం తన నివాసంలో మంచిర్యాల ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు.  పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మంచిర్యాలలో తాగునీరు సమస్య భవిష్యత్తులో ఉండబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగు దొడ్ల నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు మహిళా సంఘాలకు పాఠశాల యాజమాన్య బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంచిర్యాలలో అదనంగా రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గోదావరి పై వంతెన నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుందని, వంతెన ముల్కల్ల ప్రాంతంలో నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాలేజ్ రోడ్ నుంచి అంతర్గాం వరకు బ్రిడ్జి నిర్మాణం కేవలం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కోసమేనని, తాను స్వార్థంతో కాకుండా ప్రజల సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఓర్వలేని దివాకర్ రావు ఆటో డ్రైవర్లను రెచ్చకొట్టడం శోచనీయమన్నారు. ఆటో డ్రైవర్లకు తాను సొంతంగా జీవిత బీమా చేయించానని గుర్తు చేశారు. కాళేశ్వరం వల్ల మంచిర్యాల వరద ముంపుకు గురైతే కనీస సాయంగా పదివేలు కూడా ఇప్పించ లేదని దివాకర్ రావు పై విమర్శలు చేశారు. తాను ఎమ్మెల్యే కాగానే కరకట్ట నిర్మాణంకు 270 కోట్లు మంజూరు చేయించానని వెల్లడించారు. ఐబీ స్థలంలో ఎన్నికల కోడ్ ముగియగానే మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న డంప్ యార్డు సమస్య పరిష్కారం చూపానని, సింగరేణి స్థలంలో డంప్ యార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. సింగరేణి కార్మికులకు గత ప్రభుత్వం జారీ చేసిన ఇండ్ల పట్టాలు రద్దు చేసి స్థలంపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. తపాలపూర్ నుంచి లక్షెట్టిపేట చౌరస్తా వరకు నాలుగు వరుసల రోడ్ మంజూరైందన్నారు. తరుగు పేరుతో రైతుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఎంపీ ఎన్నికల తర్వాత ప్రతి పైసా కక్కిస్తానని అన్నారు. చిత్తశుద్ధి ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

అభివృద్ధి విషయంలో రాజీ పడను

* సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత
* మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను రాజీ పడపోనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తేల్చి చెప్పారు. బుధవారం తన నివాసంలో మంచిర్యాల ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు.  పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మంచిర్యాలలో తాగునీరు సమస్య భవిష్యత్తులో ఉండబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగు దొడ్ల నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు మహిళా సంఘాలకు పాఠశాల యాజమాన్య బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంచిర్యాలలో అదనంగా రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గోదావరి పై వంతెన నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుందని, వంతెన ముల్కల్ల ప్రాంతంలో నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాలేజ్ రోడ్ నుంచి అంతర్గాం వరకు బ్రిడ్జి నిర్మాణం కేవలం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కోసమేనని, తాను స్వార్థంతో కాకుండా ప్రజల సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఓర్వలేని దివాకర్ రావు ఆటో డ్రైవర్లను రెచ్చకొట్టడం శోచనీయమన్నారు. ఆటో డ్రైవర్లకు తాను సొంతంగా జీవిత బీమా చేయించానని గుర్తు చేశారు. కాళేశ్వరం వల్ల మంచిర్యాల వరద ముంపుకు గురైతే కనీస సాయంగా పదివేలు కూడా ఇప్పించ లేదని దివాకర్ రావు పై విమర్శలు చేశారు. తాను ఎమ్మెల్యే కాగానే కరకట్ట నిర్మాణంకు 270 కోట్లు మంజూరు చేయించానని వెల్లడించారు. ఐబీ స్థలంలో ఎన్నికల కోడ్ ముగియగానే మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న డంప్ యార్డు సమస్య పరిష్కారం చూపానని, సింగరేణి స్థలంలో డంప్ యార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. సింగరేణి కార్మికులకు గత ప్రభుత్వం జారీ చేసిన ఇండ్ల పట్టాలు రద్దు చేసి స్థలంపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. తపాలపూర్ నుంచి లక్షెట్టిపేట చౌరస్తా వరకు నాలుగు వరుసల రోడ్ మంజూరైందన్నారు. తరుగు పేరుతో రైతుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఎంపీ ఎన్నికల తర్వాత ప్రతి పైసా కక్కిస్తానని అన్నారు. చిత్తశుద్ధి ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment