అర్హత గల ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి

– నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను
– మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఈ నెల 30న జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ రోజున అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన ” నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను (ఐ ఓట్ ఫర్ షూర్) ” ప్రదర్శన బోర్డును స్వయంగా ఫొటో దిగి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, అర్హత గల ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని 100 శాతం పోలింగ్ జరిగేలా సహకరించాలని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 002 – చెన్నూర్ (ఎస్.సి.) నియోజకవర్గంలో 227, 003-బెల్లంపల్లి (ఎస్.సి.) నియోజకవర్గంలో 227, 004-మంచిర్యాల నియోజకవర్గంలో 287 మొత్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులు, 80 సం॥ల వయస్సు పైబడిన వయోవృద్ధులు, గర్భిణుల కొరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్ ఛైర్, ర్యాంపు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 1 వేయి 500 మందికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేసి ఓటర్లకు తమ నివాసం సమీపంలోనే పోలింగ్ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ఈసారి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరిగిందని, వయోవృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్ళేందుకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా, నిస్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఆర్.టి.సి. బస్టాండ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ ప్రదర్శన బోర్డులను ఉంచడం జరుగుతుందని, అధికారులు, ఉద్యోగులు, యువత ఫొటో దిగి వాట్సాప్ డిస్ప్లే, ఇతర సోషల్ మీడియాలో స్టేటస్ ద్వారా ఈ నెల 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పౌర సంబంధాల అధికారి వై.సంపత్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

అర్హత గల ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి

– నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను
– మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఈ నెల 30న జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ రోజున అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన ” నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను (ఐ ఓట్ ఫర్ షూర్) ” ప్రదర్శన బోర్డును స్వయంగా ఫొటో దిగి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, అర్హత గల ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని 100 శాతం పోలింగ్ జరిగేలా సహకరించాలని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 002 – చెన్నూర్ (ఎస్.సి.) నియోజకవర్గంలో 227, 003-బెల్లంపల్లి (ఎస్.సి.) నియోజకవర్గంలో 227, 004-మంచిర్యాల నియోజకవర్గంలో 287 మొత్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులు, 80 సం॥ల వయస్సు పైబడిన వయోవృద్ధులు, గర్భిణుల కొరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్ ఛైర్, ర్యాంపు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 1 వేయి 500 మందికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేసి ఓటర్లకు తమ నివాసం సమీపంలోనే పోలింగ్ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ఈసారి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరిగిందని, వయోవృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్ళేందుకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా, నిస్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఆర్.టి.సి. బస్టాండ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ ప్రదర్శన బోర్డులను ఉంచడం జరుగుతుందని, అధికారులు, ఉద్యోగులు, యువత ఫొటో దిగి వాట్సాప్ డిస్ప్లే, ఇతర సోషల్ మీడియాలో స్టేటస్ ద్వారా ఈ నెల 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పౌర సంబంధాల అధికారి వై.సంపత్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment