నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ రెయిన్ బో పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం వైజ్ఞానిక ప్రదర్శనను మండల విద్యాధికారి దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి దామోదర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శన దోహద పడతాయన్నారు. ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ రజని, కరెస్పాండెంట్ అమన్ ప్రసాద్ లను మండల విద్యాధికారి దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రజని, కరెస్పాండెంట్ అమన్ ప్రసాద్ లు మాట్లాడుతూ, వైజ్ఞానిక ప్రదర్శనలో కేవలం సైన్స్ అంశాలు మాత్రమే కాకుండా ఇతర విషయ పాఠ్యాంశాల ప్రదర్శనకు చోటు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందడానికి, జ్ఞాన సముపార్జనకు తల్లిదండ్రులు అందిస్తున్న సహకారానికి కృతఙ్ఞతలు తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు వైజ్ఞానిక ప్రదర్శన తిలకించారు.
72