ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

✅ శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
మానవ జీవితంలో అన్నింటి కంటే విలువైనది ఆరోగ్యమేనని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ సీఎంవో డాక్టర్ పి రమేష్ బాబుతో కలిసి ఆర్కే 8 డిస్పెన్సరీలో గుండె సంబంధిత వ్యాధుల పై అవగాహన, కరపత్రాలు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తప్పనిసరిగా వ్యాయామం, నడక, యోగ లాంటి అంశాలు ఉండేలా చూసుకోవడంతో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, కొద్ది దూరానికి వాహనాలు వినియోగించకుండా నడవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గుండెపోటు నివారణ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ధూమపానం, మద్యపానం అలవాట్లు మానుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. శరీర బరువు అదుపులో ఉంచుకుంటూ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవాలని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, సంబంధిత ఆస్పత్రిలో క్రమం తప్పకుండా చెకప్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ.కె 5, 6 గ్రూప్ గనుల ఏజెంట్ ఏవీ రెడ్డి, డాక్టర్లు వేదవ్యాస్, మురళీధర్, లోకనాథ్ రెడ్డి, స్వప్న, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

✅ శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
మానవ జీవితంలో అన్నింటి కంటే విలువైనది ఆరోగ్యమేనని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ సీఎంవో డాక్టర్ పి రమేష్ బాబుతో కలిసి ఆర్కే 8 డిస్పెన్సరీలో గుండె సంబంధిత వ్యాధుల పై అవగాహన, కరపత్రాలు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తప్పనిసరిగా వ్యాయామం, నడక, యోగ లాంటి అంశాలు ఉండేలా చూసుకోవడంతో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, కొద్ది దూరానికి వాహనాలు వినియోగించకుండా నడవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గుండెపోటు నివారణ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ధూమపానం, మద్యపానం అలవాట్లు మానుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. శరీర బరువు అదుపులో ఉంచుకుంటూ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవాలని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, సంబంధిత ఆస్పత్రిలో క్రమం తప్పకుండా చెకప్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ.కె 5, 6 గ్రూప్ గనుల ఏజెంట్ ఏవీ రెడ్డి, డాక్టర్లు వేదవ్యాస్, మురళీధర్, లోకనాథ్ రెడ్డి, స్వప్న, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment