ఉద్యోగులకు లాభాల్లో వాటా ఇస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి

  •  సింగరేణి పురోభివృద్ధికి సమిష్టిగా  కృషి చేయాలి
  •  మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఆర్.కె న్యూస్, నస్పూర్: దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని విధంగా సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో వాటా చెల్లిస్తుందని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఉపరితల గనిలో నిర్వహించిన మల్టీ డిపార్టుమెంటల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల పాత్ర అనే కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్థ స్థితిగతులు ఉద్యోగులకు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని అన్నారు. సింగరేణిలో శ్రీరాంపూర్ ఏరియాకు ప్రత్యేక స్థానం ఉందని, అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులు సమిష్టిగా సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలన్నారు. సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మంచిర్యాల జిల్లాలోని బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకే వస్తాయని, కొత్త గనులు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయాని అన్నారు. త్వరలో సింగరేణిలో అపార అనుభవం కలిగి ఈ నెలలో పదవీ విరమణ పొందుతున్న ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి సేవలు సింగరేణికి అవసరమని, రిటైర్మెంట్ అనంతరం ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. అన్ని కార్మిక సంఘాలతో కలిసి సంస్థ పురోభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ అధునాతన టెక్నాలజీతో బొగ్గు వెలికి తీస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి రావలసిన బకాయిలను ఏక మొత్తంలో కాకపోయినా విడతల వారీగా చెల్లించాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిచాలని, కొత్త గనులు ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, ఎస్సార్సీ ఓసీపీ పీవో టి. శ్రీనివాస్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

ఉద్యోగులకు లాభాల్లో వాటా ఇస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి

  •  సింగరేణి పురోభివృద్ధికి సమిష్టిగా  కృషి చేయాలి
  •  మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఆర్.కె న్యూస్, నస్పూర్: దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని విధంగా సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో వాటా చెల్లిస్తుందని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఉపరితల గనిలో నిర్వహించిన మల్టీ డిపార్టుమెంటల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల పాత్ర అనే కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్థ స్థితిగతులు ఉద్యోగులకు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని అన్నారు. సింగరేణిలో శ్రీరాంపూర్ ఏరియాకు ప్రత్యేక స్థానం ఉందని, అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులు సమిష్టిగా సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలన్నారు. సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మంచిర్యాల జిల్లాలోని బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకే వస్తాయని, కొత్త గనులు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయాని అన్నారు. త్వరలో సింగరేణిలో అపార అనుభవం కలిగి ఈ నెలలో పదవీ విరమణ పొందుతున్న ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి సేవలు సింగరేణికి అవసరమని, రిటైర్మెంట్ అనంతరం ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. అన్ని కార్మిక సంఘాలతో కలిసి సంస్థ పురోభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ అధునాతన టెక్నాలజీతో బొగ్గు వెలికి తీస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి రావలసిన బకాయిలను ఏక మొత్తంలో కాకపోయినా విడతల వారీగా చెల్లించాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిచాలని, కొత్త గనులు ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, ఎస్సార్సీ ఓసీపీ పీవో టి. శ్రీనివాస్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment