ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం

  • పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి

ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్‌లో పీఆర్‌టీయూటీఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఉపాద్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేజీవీబీల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. త్వరలో జరుగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘం బలపరిచిన అభ్యర్థులు వంగ మహేందర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డిలను మొదటి ప్రాధ్యానత ఓటు వేసి గెలిపించాలన్నారు. అప్పుడే శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతు వినబడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, తన హయాంలో మహిళా టీచర్లకు అధనంగా  5 సీఎల్స్, మెటర్నీటీలీవ్‌లు మంజూరు చేయించామన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తనను ఉపాధ్యాయ ప్రతినిధిగా శాసన మండలికి పంపాలన్నారు. తాను గెలిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

  • జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నిక

ఈ సమావేశంలో పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బచ్చ మోహన్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులుగా నిచ్చకోల మహేశ్వర్ , రాష్ట్ర అసోసియేట్‌ సభ్యునిగా బిల్లా తిరుపతయ్య, మీడియా ఇంచార్జీగా కే తిరుపతిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొండు జనార్ధన్, అధ్యక్షులు కొట్టె శంకర్, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షురాలు శాంకరీ, ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం

  • పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి

ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్‌లో పీఆర్‌టీయూటీఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఉపాద్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేజీవీబీల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. త్వరలో జరుగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘం బలపరిచిన అభ్యర్థులు వంగ మహేందర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డిలను మొదటి ప్రాధ్యానత ఓటు వేసి గెలిపించాలన్నారు. అప్పుడే శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతు వినబడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, తన హయాంలో మహిళా టీచర్లకు అధనంగా  5 సీఎల్స్, మెటర్నీటీలీవ్‌లు మంజూరు చేయించామన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తనను ఉపాధ్యాయ ప్రతినిధిగా శాసన మండలికి పంపాలన్నారు. తాను గెలిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

  • జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నిక

ఈ సమావేశంలో పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బచ్చ మోహన్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులుగా నిచ్చకోల మహేశ్వర్ , రాష్ట్ర అసోసియేట్‌ సభ్యునిగా బిల్లా తిరుపతయ్య, మీడియా ఇంచార్జీగా కే తిరుపతిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొండు జనార్ధన్, అధ్యక్షులు కొట్టె శంకర్, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షురాలు శాంకరీ, ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment