ఆర్.కె న్యూస్, మంచిర్యాల: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా శాఖ సంఘం సభ్యులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి అసోసియేషన్ తరుపున శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ సమాజం బాగు కొరకు, వివిధ మానసిక సమస్యలు తొలగించడానికి, యువత, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి సైకాలజిస్టులు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారుడు గుండేటి యోగేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి చెరుకు శశి కిరణ్, సిహెచ్ దేవాన్షి, కార్యవర్గ సభ్యులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
188