ఎమ్మెల్సీగా  అవకాశం ఇస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి

  • ఏ.ఐ.ఎఫ్.బి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్

నస్పూర్, ఆర్.కె న్యూస్: రాబోయే ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపిస్తే పట్టభద్రులు, నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఎమ్మెల్సీ పదవికి వన్నె తెస్తానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు పట్టం కట్టిన చరిత్ర ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఉందని, ప్రైవేట్ టీచర్లు చాలీ చాలని జీతాలతో పని చేస్తున్నారని, ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని, నిరుద్యోగులకు ఒక్క రూపాయికే 5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు విద్యావేత్తలు కాదని, విద్య వ్యాపారవేత్తలని, పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిచిన, ఓడిన రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ తేడా ఏమి ఉందన్నారు. చట్ట ప్రకారం సీరియల్ నెంబర్ 4లో ఉండాల్సిన తన పేరును 11వ నెంబర్ లో పెట్టారని అన్నారు. ఐదు సార్లు కార్పొరేటర్ గా, మేయర్ గా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశానని, కరీంనగర్ మేయర్ గా ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి తేజ్ రెడ్డి, రాము యాదవ్, క్రాంతి, సాయి వర్ధన్, సిజ్జు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

ఎమ్మెల్సీగా  అవకాశం ఇస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి

  • ఏ.ఐ.ఎఫ్.బి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్

నస్పూర్, ఆర్.కె న్యూస్: రాబోయే ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపిస్తే పట్టభద్రులు, నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఎమ్మెల్సీ పదవికి వన్నె తెస్తానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు పట్టం కట్టిన చరిత్ర ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఉందని, ప్రైవేట్ టీచర్లు చాలీ చాలని జీతాలతో పని చేస్తున్నారని, ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని, నిరుద్యోగులకు ఒక్క రూపాయికే 5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు విద్యావేత్తలు కాదని, విద్య వ్యాపారవేత్తలని, పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిచిన, ఓడిన రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ తేడా ఏమి ఉందన్నారు. చట్ట ప్రకారం సీరియల్ నెంబర్ 4లో ఉండాల్సిన తన పేరును 11వ నెంబర్ లో పెట్టారని అన్నారు. ఐదు సార్లు కార్పొరేటర్ గా, మేయర్ గా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశానని, కరీంనగర్ మేయర్ గా ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి తేజ్ రెడ్డి, రాము యాదవ్, క్రాంతి, సాయి వర్ధన్, సిజ్జు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment