నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎస్.పి ఏసీ ఫంక్షన్ హాల్ ను మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ యజమానులు సూరపనేని శ్రీనివాస రావు, పోరెడ్డి లక్ష్మా రెడ్డి, భీంరెడ్డి రవీందర్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫంక్షన్ హాల్ యజమానులు మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుమిల్ల వేణు, కాంగ్రెస్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
44