మాజీ ప్రభుత్వ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఓదెలు తిరిగి భారాసలో చేరారు. భారాసలో ఇమడలేకపోయిన నల్లాల ఓదెలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శుక్రవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భారత రాష్ట్ర సమితిని వీడుతున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. బీజేపీలో చేరుతున్నారని పుకార్లు కూడా వినిపించాయి. బీజేపీ లో టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పలేమని, పార్టీలో మాత్రం చేర్చుకుంటామని బీజేపీ పెద్దలు ఖరాకండిగా చెప్పడంతో బీజేపీలో చేరడానికి ఓదెలు ఆసక్తి చూపలేదని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. నల్లాల ఓదెలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ చెన్నూర్ టికెట్ కోసం పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు కొంతమంది నాయకులు కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
227