కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలి

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ డిమాండ్ చేశారు. గురువారం సిహెచ్ పి రైల్వే సైడింగ్ మెయింటెనెన్స్ కార్మికులతో మాట్లాడుతూ, సకాలంలో జీతాలు చెల్లించేలా యాజమాన్యం కృషి చేయాలన్నారు. ప్రతి నెల ఏడవ తేదీన వేతనాలు చెల్లించాలని సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిన ఆ సర్క్యులర్ ను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు వచ్చే అరకొర జీతాలు కూడా నెల చివరి వారంలో తప్ప ముందు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేసే పోరాట కార్యక్రమాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డిపట్ల రవీందర్, బాపు, సది, సతీష్, వంశీ, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలి

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ డిమాండ్ చేశారు. గురువారం సిహెచ్ పి రైల్వే సైడింగ్ మెయింటెనెన్స్ కార్మికులతో మాట్లాడుతూ, సకాలంలో జీతాలు చెల్లించేలా యాజమాన్యం కృషి చేయాలన్నారు. ప్రతి నెల ఏడవ తేదీన వేతనాలు చెల్లించాలని సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిన ఆ సర్క్యులర్ ను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు వచ్చే అరకొర జీతాలు కూడా నెల చివరి వారంలో తప్ప ముందు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేసే పోరాట కార్యక్రమాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డిపట్ల రవీందర్, బాపు, సది, సతీష్, వంశీ, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment