కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

– సింగరేణి ఎన్నికల్లో సిఐటియు కార్మిక సంఘాన్ని గెలిపించాలి
– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
ఆర్.కె న్యూస్, నస్పూర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ రాజలింగు అధ్యక్షతన నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) అనుబంధ రంగాల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల  సమస్యలు పరిష్కరించి, వారిని వెంటనే  రెగ్యులర్ చేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఐదు జివోలను గెజిట్ చేసి అమలు చేయాలన్నారు. డిసెంబర్ 27న జరిగే  సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు దూలం శ్రీనివాస్, కుంటాల కుమార్, దాగం రాజారాం, నర్సింహులు, శోభ, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

– సింగరేణి ఎన్నికల్లో సిఐటియు కార్మిక సంఘాన్ని గెలిపించాలి
– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
ఆర్.కె న్యూస్, నస్పూర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ రాజలింగు అధ్యక్షతన నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) అనుబంధ రంగాల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల  సమస్యలు పరిష్కరించి, వారిని వెంటనే  రెగ్యులర్ చేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఐదు జివోలను గెజిట్ చేసి అమలు చేయాలన్నారు. డిసెంబర్ 27న జరిగే  సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు దూలం శ్రీనివాస్, కుంటాల కుమార్, దాగం రాజారాం, నర్సింహులు, శోభ, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment