కారుణ్య నియమాకాలతో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్

✅ కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్
✅ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ గెలిపించాలి
✅ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు
కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్టీయూసీ, ఇతర జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె5 గని వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్మికులను కోరారు. కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులకు సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీబీజీకేఎస్ లను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు ఢీకొండ అన్నయ్య, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, జిఎం చర్చల ప్రతినిధులు పెట్టేం లక్ష్మణ్, కాశి రావు, బ్రాంచ్ కార్యదర్శి రమేష్, పిట్ కార్యదర్శి మహేందర్ రెడ్డి, నాయకులు రౌతు సత్యనారాయణ, మల్లేష్, శ్రీనివాసరావు,  నీలం సదయ్య, అన్వేష్ రెడ్డి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

కారుణ్య నియమాకాలతో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్

✅ కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్
✅ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ గెలిపించాలి
✅ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు
కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్టీయూసీ, ఇతర జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె5 గని వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్మికులను కోరారు. కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులకు సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీబీజీకేఎస్ లను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు ఢీకొండ అన్నయ్య, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, జిఎం చర్చల ప్రతినిధులు పెట్టేం లక్ష్మణ్, కాశి రావు, బ్రాంచ్ కార్యదర్శి రమేష్, పిట్ కార్యదర్శి మహేందర్ రెడ్డి, నాయకులు రౌతు సత్యనారాయణ, మల్లేష్, శ్రీనివాసరావు,  నీలం సదయ్య, అన్వేష్ రెడ్డి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment