కార్మికుల సమస్యలు మాట్లాడని ఎమ్మెల్యేలు అవసరమా

ఆర్.కె న్యూస్, నస్పూర్:
కార్మికుల సమస్యల పై అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూ టెక్ గని పై జరిగిన గేట్ మీటింగ్ లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ సంఘం నాయకులు ఏనాడూ మాట్లాడలేదని, కోవిడ్ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేసిన కనీసం సొంతింటి పథకం కోసం ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తే కార్మికుల గురించి అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని ప్రశ్నించారు. ఏరియర్స్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మాట్లాడారని చెప్పే నాయకులు సంస్థకు రావలసిన బకాయిలు రాక ఆర్థికంగా నష్టపోతూ చివరికి ఉద్యోగుల జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి మారు పేర్లు సవరిస్తానని చెప్పిన ఇంతవరకు అమలు కాలేదని, 2011లో అలవెన్స్ ల పై ఐటీ మాఫీ ఒప్పందాన్ని కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేస్తే అధికారులు అమలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి అనుబంధంగా కొనసాగుతూ కూడా కార్మికులకు ఎందుకు అమలు చేయించలేకపోతున్నారో టీబీజీకేఎస్ సంఘం చెప్పాలన్నారు. సిఐటియు నల్లబ్యాడ్జీలతో మొదలుపెట్టిన నిరసన కార్యక్రమాలతో పాటు ఇతర సంఘాలు చేసిన నిరసనలతో యాజమాన్యం స్పందించి ఏరియర్స్ పై ప్రకటన చేసిందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించే వరకు సింగరేణి నాయకులకు లాభాల గురించి ప్రకటన వస్తుందని తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సంస్థకు రావలసిన బకాయిలను ఇప్పించి లాభాల వాటా చెల్లింపు పై స్పష్టమైన తేదీ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుల్ల బాలాజీ, గోదారి భాగ్యరాజ్, విడువల్లి శంకర్, వెంగళ శ్రీనివాస్, శ్రీపతి బాణేష్, అజయ్, ఆసంపల్లి అశోక్, పెరుక సదానందం, రాజయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

కార్మికుల సమస్యలు మాట్లాడని ఎమ్మెల్యేలు అవసరమా

ఆర్.కె న్యూస్, నస్పూర్:
కార్మికుల సమస్యల పై అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూ టెక్ గని పై జరిగిన గేట్ మీటింగ్ లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ సంఘం నాయకులు ఏనాడూ మాట్లాడలేదని, కోవిడ్ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేసిన కనీసం సొంతింటి పథకం కోసం ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తే కార్మికుల గురించి అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని ప్రశ్నించారు. ఏరియర్స్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మాట్లాడారని చెప్పే నాయకులు సంస్థకు రావలసిన బకాయిలు రాక ఆర్థికంగా నష్టపోతూ చివరికి ఉద్యోగుల జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి మారు పేర్లు సవరిస్తానని చెప్పిన ఇంతవరకు అమలు కాలేదని, 2011లో అలవెన్స్ ల పై ఐటీ మాఫీ ఒప్పందాన్ని కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేస్తే అధికారులు అమలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి అనుబంధంగా కొనసాగుతూ కూడా కార్మికులకు ఎందుకు అమలు చేయించలేకపోతున్నారో టీబీజీకేఎస్ సంఘం చెప్పాలన్నారు. సిఐటియు నల్లబ్యాడ్జీలతో మొదలుపెట్టిన నిరసన కార్యక్రమాలతో పాటు ఇతర సంఘాలు చేసిన నిరసనలతో యాజమాన్యం స్పందించి ఏరియర్స్ పై ప్రకటన చేసిందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించే వరకు సింగరేణి నాయకులకు లాభాల గురించి ప్రకటన వస్తుందని తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సంస్థకు రావలసిన బకాయిలను ఇప్పించి లాభాల వాటా చెల్లింపు పై స్పష్టమైన తేదీ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుల్ల బాలాజీ, గోదారి భాగ్యరాజ్, విడువల్లి శంకర్, వెంగళ శ్రీనివాస్, శ్రీపతి బాణేష్, అజయ్, ఆసంపల్లి అశోక్, పెరుక సదానందం, రాజయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment