ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిబిజికెఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టిబిజికెఎస్ నాయకులు మాట్లాడుతూ కోల్ ఇండియాలో ఎన్నో హక్కులు సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కార్మికవర్గం కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి,బ్రాంచ్ సెక్రటరీలు పానుగంటి సత్తయ్య,భూపతి అశోక్, కానుగంటి చంద్రయ్య, మహిపాల్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీలు జగదీశ్వర్ రెడ్డి, తొంగల రమేష్, శ్రీనివాస్ యాదవ్, ఏరియా నాయకులు నీలం సదయ్య, పొగాకు రమేష్,పిట్ సెక్రెటరీలు మహేందర్ రెడ్డి, మెండె వెంకటి, వెంకటేశ్వరరావు, ఇప్ప భూమయ్య, జంపయ్య, నాయకులు ఒల్లాల రవి, మహేష్ రాజ్, ఉత్తేజ్ రెడ్డి, ప్రసాద్, కాల్వ శ్రీను, శంకరయ్య, తిరుపతి రావు సంతోష్,వెంకటరమణ రెడ్డి, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
199