కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి

– ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్

శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్ అన్నారు. మంగళవారం ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, 003 బెల్లంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్, డి.పి.సి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, 002-చెన్నూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు, 004-మంచిర్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాములు, ఎ.సి.పి. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. 002-చెన్నూర్ (ఎస్.సి.), 003-బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల నియోజకవర్గాలకు కౌంటింగ్ జరుగుతుందని, ఈ క్రమంలో ఎన్నికల అధికారులకు, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లా వ్యాప్తంగా 741 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి పని చేయాలని, ఉల్లంఘించినట్లయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి

– ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్

శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్ అన్నారు. మంగళవారం ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, 003 బెల్లంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్, డి.పి.సి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, 002-చెన్నూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు, 004-మంచిర్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాములు, ఎ.సి.పి. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. 002-చెన్నూర్ (ఎస్.సి.), 003-బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల నియోజకవర్గాలకు కౌంటింగ్ జరుగుతుందని, ఈ క్రమంలో ఎన్నికల అధికారులకు, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లా వ్యాప్తంగా 741 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి పని చేయాలని, ఉల్లంఘించినట్లయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment