- శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ అన్నారు. ఆదివారం ఆర్.కె 6 హనుమాన్ నగర్ లోని బాల గణేష్ మండపంలో వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మండపం నిర్వాహకులు ఎస్ఐ సంతోష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగిడి రాజేష్, క్యాతం సతీష్, రమేష్, భీమయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.