- శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: గుండెపోటు నివారణ చర్యలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్.కె 8 డిస్పెన్సరీలో డివైసీఎంఓ డాక్టర్ పి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని అన్నారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవాలని, గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు తప్పనిసరిగా మందులు ప్రతిరోజు వాడుతూ ఉండాలని, సంబంధిత ఆస్పత్రిలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, వ్యాధి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన నివారణ చర్యలకు సంబంధించిన కరపత్రాన్ని జనరల్ మేనేజర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ వేదవ్యాస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి, డాక్టర్ మనీషా, డాక్టర్ పింకీ, డిస్పెన్సరీ పిట్ కార్యదర్శి విజయలక్ష్మి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.