ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 జయంతి వేడుకలు నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించారు.  కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకై అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గళమెత్తి తన పదవులు తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకాని బొడ్డయ్య, ప్రధాన కార్యదర్శి వేముల సురేష్, శ్రీలక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ కమిటీ అధ్యక్షులు  సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, కోశాధికారి కుసుమ శంకర్, నల్ల సంపత్,   కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 జయంతి వేడుకలు నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించారు.  కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకై అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గళమెత్తి తన పదవులు తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకాని బొడ్డయ్య, ప్రధాన కార్యదర్శి వేముల సురేష్, శ్రీలక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ కమిటీ అధ్యక్షులు  సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, కోశాధికారి కుసుమ శంకర్, నల్ల సంపత్,   కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment