ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ సూరిమిల్ల వేణు, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ లు మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ శాంతి, అహింసా మార్గంలో పోరాడారని అన్నారు. అనంతరం స్వచ్ఛత హీ సేవ చివరి రోజు కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మునిసిపాలిటీలో పని చేస్తున్న 5 మంది శానిటేషన్ సిబ్బందిని శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
146