చట్టసభల్లో మహిళా బిల్లు ఆమోదం హర్షణీయమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధాకుమారి అన్నారు. గురువారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సేవా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్, సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ చట్టసభలలో మహిళా బిల్లు ఆమోదం సంతోషకరమని, మహిళలు తమ ప్రతిభతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని అన్నారు. పార్లమెంట్ లో మహిళలకు ప్రాధాన్యం లభించడం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి ఫలితమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, సీనియర్ పిఓ శ్రీ కాంతారావు, ఎస్టేట్స్ ఆఫీసర్స్ వరలక్ష్మి, స్వప్న, లా ఆఫీసర్ ప్రబంధిత, జనరల్ మేనేజర్ కార్యాలయ మహిళా ప్రతినిధి ఆకుల అఖిల, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, సేవా సభ్యులు శారద, రజిత, జనరల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
240