జి.ఓ. నం.58, 59 ప్రజలకు ప్రభుత్వం అందించిన వరం

ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పాటు చేసుకుని గత ఏండ్లుగా నివాసం ఉంటున్న వారికి యాజమాన్య హక్కు కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జి.ఓ. నం.58, 59 ఒక వరమని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు తో కలిసి జి.ఓ. 59 క్రింద దరఖాస్తు చేసుకున్న నస్పూర్ కు చెందిన లబ్దిదారులు వేముల రమేష్, కారపూరి రజిత, వసంతుల సురేష్ కు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పాటు చేసుకుని గత ఏండ్లుగా నివసిస్తూ భూముల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి జి.ఓ. 58, 59 క్రింద ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జి.ఓ. నం.59 క్రింద దరఖాస్తు చేసుకొని నోటీసు పొందిన వారు నిర్ణీత గడువులోగా ప్రభుత్వ రుసుము చెల్లించి పట్టా పొందాలని తెలిపారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

జి.ఓ. నం.58, 59 ప్రజలకు ప్రభుత్వం అందించిన వరం

ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పాటు చేసుకుని గత ఏండ్లుగా నివాసం ఉంటున్న వారికి యాజమాన్య హక్కు కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జి.ఓ. నం.58, 59 ఒక వరమని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు తో కలిసి జి.ఓ. 59 క్రింద దరఖాస్తు చేసుకున్న నస్పూర్ కు చెందిన లబ్దిదారులు వేముల రమేష్, కారపూరి రజిత, వసంతుల సురేష్ కు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పాటు చేసుకుని గత ఏండ్లుగా నివసిస్తూ భూముల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి జి.ఓ. 58, 59 క్రింద ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జి.ఓ. నం.59 క్రింద దరఖాస్తు చేసుకొని నోటీసు పొందిన వారు నిర్ణీత గడువులోగా ప్రభుత్వ రుసుము చెల్లించి పట్టా పొందాలని తెలిపారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment