టీస్ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్, క్లీనర్స్ యూనియన్ అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణానికి చెందిన రెంక రవి ఎన్నికయ్యారు. యాదగిరి గుట్టలో నిర్వహించిన సమావేశంలో టీస్ఆర్టీసీ అద్దె బస్సు ల డ్రైవర్స్, క్లీనర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వంగల రాజు, కోశాధికారిగా రాజు నాయక్, ఉపాధ్యక్షులుగా సంతోష్ నాయక్, వెంకటేష్, కుమార్, శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా శ్రావణ్ కుమార్, రవీందర్, శ్రీనివాస్, శ్యామ్, ప్రశాంత్, సలహాదారులుగా చందు, బిక్షపతి, శ్రీనివాస్ రెడ్డిలు ఎన్నికయ్యారు. టీస్ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్, క్లీనర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రెంక రవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
216