ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం సీసీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై చేపట్టిన వాహన తనిఖీల్లో 7 లక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కె. స్వామినాథం వద్ద 7 లక్షల లభించాయని, సరైన ఆధారాలు చూపకపోవడంతో సదరు డబ్బును సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కు అప్పగించినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.
219