– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మంచిర్యాల ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే నస్పూర్ మున్సిపాలిటీ నీ స్మార్ట్ సిటీగా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ అన్నారు. బుధవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని విలేజ్ నస్పూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. విలేజ్ నస్పూర్ ప్రజలను ప్రస్తుత ఎమ్మెల్యే దివాకర్ రావు నిర్లక్ష్యం చేశాడని, స్థానికంగా సరైన రోడ్లు లేవని, తాగునీటి సమస్య పరిష్కరించడంలో మ్మెల్యే దివాకర్ రావు విఫలం అయ్యాడన్నారు. చెల్లని పట్టాలు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు నస్పూర్ పేద ప్రజలను మోసం చేశాడని అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు, సరైన రహదారులు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అగల్ డ్యూటీ రాజు, జి.వి ఆనంద్, సత్రం రమేష్, ఈర్ల సదానందం, మిట్టపల్లి మొగిలి, సిరికొండ రాజు, కొరెపు మహేందర్, రనవేణి శ్రీను, కుర్రే చక్రి, మద్ది సుమన్, కొంతం మహేందర్, తాడూరి మహేష్, బద్రి శ్రీకాంత్, తిరుపతి, కట్కూరి సతీష్, బుసరపు తిరుపతి, కామ రాజు, కొండ్ర రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
216