నాణ్యత ప్రమాణాలు పాటించని భోజనశాలలు – కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం

– వెజ్ నూడిల్స్ లో ఈగ ప్రత్యక్షం
– అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమా?
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న శ్రీ గీతా భవన్ ఉడిపి హోటల్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కుటుంబంతో కలిసి గీత భవన్ వచ్చిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బాధితుడు తెలిపిన వివరాలి ఇలా ఉన్నాయి. ఏసీ సెక్షన్ లో వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేయగా, కొంత సమయానికి వెయిటర్ తీసుకొచ్చిన వేసిన నూడిల్స్ లో ఈగ ప్రత్యక్షమైంది. దీంతో వెజ్ నూడిల్స్ తినడానికి వచ్చిన వారు కంగు తిన్నారు. సదరు హోటల్ సిబ్బందిని పిలిచి వివరణ అడగగా మీరు తింటూ ఉండగా గాలికి వచ్చి పడి ఉండొచ్చని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. తినే సమయంలో ఈగ వచ్చి పడిందంటే హోటల్ లో శుభ్రత పాటించడం లేదని సిబ్బంది అంగీకరించినట్టే కదా. వెజ్ నూడిల్స్ ఉన్న ప్లేట్ ను పరిశీలించగా అందులో ఉన్న ఈగ ఆయిల్ లో పూర్తిగా ఫ్రై అయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. హోటల్ యజమానిని పిలవమని సిబ్బందిని అడగగా హోటల్ యజమాని ఊర్లో లేడని, మా యజమాని ఫోన్ నెంబర్ కూడా మా దగ్గర లేదని హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. మీకు కావాలంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరే ఏదైనా ఇస్తామని బదులిచ్చారు. కనీస నాణ్యత ప్రమాణాలు, శుభ్రత పాటించడం లేదని, ఏసీ సెక్షన్ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. వెంటనే మంచిర్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ కు చరవాణి ద్వారా ఫిర్యాదు చేయగా తనిఖీలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే హోటల్ యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మంచిర్యాల జిల్లాలోని పలు హోటళ్లపై అత్యవసరంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిందిగా అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో, హోటళ్ల నిర్వహణ తీరులో ఏమైనా మార్పులు వస్తాయో లేదో చూడాలి.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

నాణ్యత ప్రమాణాలు పాటించని భోజనశాలలు – కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం

– వెజ్ నూడిల్స్ లో ఈగ ప్రత్యక్షం
– అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమా?
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న శ్రీ గీతా భవన్ ఉడిపి హోటల్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కుటుంబంతో కలిసి గీత భవన్ వచ్చిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బాధితుడు తెలిపిన వివరాలి ఇలా ఉన్నాయి. ఏసీ సెక్షన్ లో వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేయగా, కొంత సమయానికి వెయిటర్ తీసుకొచ్చిన వేసిన నూడిల్స్ లో ఈగ ప్రత్యక్షమైంది. దీంతో వెజ్ నూడిల్స్ తినడానికి వచ్చిన వారు కంగు తిన్నారు. సదరు హోటల్ సిబ్బందిని పిలిచి వివరణ అడగగా మీరు తింటూ ఉండగా గాలికి వచ్చి పడి ఉండొచ్చని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. తినే సమయంలో ఈగ వచ్చి పడిందంటే హోటల్ లో శుభ్రత పాటించడం లేదని సిబ్బంది అంగీకరించినట్టే కదా. వెజ్ నూడిల్స్ ఉన్న ప్లేట్ ను పరిశీలించగా అందులో ఉన్న ఈగ ఆయిల్ లో పూర్తిగా ఫ్రై అయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. హోటల్ యజమానిని పిలవమని సిబ్బందిని అడగగా హోటల్ యజమాని ఊర్లో లేడని, మా యజమాని ఫోన్ నెంబర్ కూడా మా దగ్గర లేదని హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. మీకు కావాలంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరే ఏదైనా ఇస్తామని బదులిచ్చారు. కనీస నాణ్యత ప్రమాణాలు, శుభ్రత పాటించడం లేదని, ఏసీ సెక్షన్ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. వెంటనే మంచిర్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ కు చరవాణి ద్వారా ఫిర్యాదు చేయగా తనిఖీలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే హోటల్ యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మంచిర్యాల జిల్లాలోని పలు హోటళ్లపై అత్యవసరంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిందిగా అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో, హోటళ్ల నిర్వహణ తీరులో ఏమైనా మార్పులు వస్తాయో లేదో చూడాలి.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment