వేమనపల్లి, ఆర్.కె న్యూస్: నీల్వాయి నూతన ఎస్సైగా జగదీశ్వర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్న నేరుగా వచ్చి తమను కలవచ్చని ఆయన పేర్కొన్నారు.
45





