ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థలో సుదీర్ఘ కాలం పని చేసి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని ఆర్కే-న్యూటెక్ గని ఎస్.ఓ.ఎం ఇ.స్వామిరాజు అన్నారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గని ఎస్.ఓ.ఎం ఇ.స్వామిరాజు శాలువలు, పూలమాలతో ఘనంగా సన్మానించి, సన్మాన పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆర్కే-న్యూటెక్ గని ఎస్.ఓ.ఎం మాట్లాడుతూ సింగరేణి ప్రగతిలో ఉద్యోగుల సేవలు మరువలేనివని అన్నారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు తదుపరి జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇన్ఛార్జి రక్షణాధికారి శంకర్, పిట్ ఇంజినీర్ రాజగోపాలచారి, ఇంజినీర్ కృష్ణ, సర్వే అధికారి పిచ్చేశ్వర్ రావు, అండర్ మేనేజర్లు పరమేష్, చంద్రమౌళి, తెబొగకాసం, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శులు ఎం.జంపయ్య, ఎ.లక్ష్మణ్, బీఎంఎస్ ప్రతినిధి వినయ్ కుమార్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
261