ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ అండ్ పిసి విభాగంలో పూర్తి సర్వీస్ కాలం పనిచేసి పదవీ విరమణ పొందిన గొల్లపల్లి కనకయ్యను కార్యాలయ ఆవరణలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ మాట్లాడుతూ… సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం పాత్ర కీలకమైనదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాలని అన్నారు. పదవీ విరమణ ఉద్యోగి విధి నిర్వహణలో కంపెనీకి చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ తదుపరి జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ పోగుల స్వామి, జూనియర్ ఇన్స్పెక్టర్ సిర్ర రాజయ్య, జమ్మేదార్ లు ఎస్.కె.దాస్, బడికెల రాం చందర్, గుర్తింపు సంఘం పిట్ సెక్రెటరీ ఆడెపు మల్లికార్జున్, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
169