- గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య
ఆర్ . కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు అభినందనీయం గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వీరభద్రయ్య మాట్లాడుతూ, పదవీ విరమణ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు, జిఎం కమిటీ మెంబర్ చంద్రశేఖర్, మైనింగ్ స్టాప్ ఏరియా నాయకుడు రాజేందర్, బ్రాంచ్ మీడియా ప్రతినిధి రాజ్ కుమార్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సదానందం, అనిల్, యాదగిరి,చిలక రమేష్, అఖిల్, శంకర్, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.