పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వినియోగించాలి

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వినియోగించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. శనివారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టితో తయారు చేసిన వినాయకులను వాడాలని అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను సమన్వయంతో భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని అన్నారు. రసాయనాలతో తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం కలుషితం అవుతుందని, అందుకు పూజా కార్యక్రమాలకు మట్టి వినాయకులను వినియోగించుకోవాలని కోరారు. ఆదిలాబాద్ శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆదిలాబాదు జిల్లాలోనే పెద్ద మొత్తంలో వినాయకుని ప్రతిష్టించడం జరుగుతుందని, ప్రజలందరూ భక్తి భావనతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మట్టి వినాయకుల వినియోగం అవసరమని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, బీసీ సంఘం ప్రతినిధులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వినియోగించాలి

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వినియోగించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. శనివారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టితో తయారు చేసిన వినాయకులను వాడాలని అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను సమన్వయంతో భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని అన్నారు. రసాయనాలతో తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం కలుషితం అవుతుందని, అందుకు పూజా కార్యక్రమాలకు మట్టి వినాయకులను వినియోగించుకోవాలని కోరారు. ఆదిలాబాద్ శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆదిలాబాదు జిల్లాలోనే పెద్ద మొత్తంలో వినాయకుని ప్రతిష్టించడం జరుగుతుందని, ప్రజలందరూ భక్తి భావనతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మట్టి వినాయకుల వినియోగం అవసరమని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, బీసీ సంఘం ప్రతినిధులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment