రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జిలు, సీసీసీ కార్నర్ బస్ స్టాప్ వద్ద పోలీసులు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీసీసీ నస్పూర్ ఎస్సై ఎం. రవి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డబ్బు, వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన, అక్రమ రవాణాకు పాల్పడిన, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలు అతిక్రమించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
282