ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. గురువారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, వినాయక విగ్రహాలు పెట్టదలచిన వారు ఆన్ లైన్ లో తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని, ఎలక్ట్రిసిటీ, మైక్ అనుమతులు తీసుకోవాలన్నారు. మండపం దగ్గర భద్రత చర్యలు తీసుకోవాలని, గణేష్ మండపం వద్ద 24 గంటలు ఇద్దరు నిర్వాహకులు ఉండాలని సూచనలు చేశారు. నిమజ్జనం రోజు డీజే పెట్టొద్దని, మండపం వద్ద రాత్రి వేళలో మద్యం,పేకాట లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసరమైతే 100 కి ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. గురువారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, వినాయక విగ్రహాలు పెట్టదలచిన వారు ఆన్ లైన్ లో తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని, ఎలక్ట్రిసిటీ, మైక్ అనుమతులు తీసుకోవాలన్నారు. మండపం దగ్గర భద్రత చర్యలు తీసుకోవాలని, గణేష్ మండపం వద్ద 24 గంటలు ఇద్దరు నిర్వాహకులు ఉండాలని సూచనలు చేశారు. నిమజ్జనం రోజు డీజే పెట్టొద్దని, మండపం వద్ద రాత్రి వేళలో మద్యం,పేకాట లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసరమైతే 100 కి ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment