బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులై పలువురు యువకులు, మహిళలు బద్రి శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సమక్షంలో పార్టీలో చేరారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు ఉదయ్ నగర్ లోని యువత, మహిళలు జిల్లా అధ్యక్షులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని, బీజేపీ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యదర్శి మిట్టపల్లి మొగిలి, యువ మోర్చా నస్పూర్ పట్టణ అధ్యక్షులు కొండ వెంకటేష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కుర్రే చక్రి, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు సిరికొండ రాజు, బీజేవైఎం నాయకులు అంబాలా సాగర్, కొంతం మహేందర్, మహిళా మోర్చా నాయకురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.
214