50
నస్పూర్, ఆర్. కె న్యూస్: కాలి గాయంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రేమ్ సాగర్ రావు పూర్తిగా కోలుకొని, మళ్లీ జనాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయనకు శీఘ్ర స్వస్థత కలగాలని ఆకాంక్షిస్తూ, పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.