మత్తు పదార్థాల వినియోగం యువత భవితకు నిరోధకం- జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మత్తు పదార్థాలు, మద్యపానీయాల వినియోగం యువత భవిష్యత్తుకు నిరోధకమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి జిల్లా పోలీస్, విద్య, వైద్య, అటవీ, వ్యవసాయ, సాంఘిక, ఆదాయ పన్ను, రెవెన్యూ శాఖల అధికారులు, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎన్.సి.బి. ప్రతినిధులతో మత్తు పదార్థాల నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత మద్యానికి, మత్తు పదార్థాలు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మంచి భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో నిషేధించబడిన మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో గంజాయి సాగు జరుగకుండా వ్యవసాయ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో రి-హాబిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెలలో ఒకరోజు ప్రజావాణి కార్యక్రమంలో మత్తు పదార్థాల నియంత్రణ పై సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎ.సి.పి. తిరుపతి రెడ్డి, సి.ఐ. రాజు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చందన, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

మత్తు పదార్థాల వినియోగం యువత భవితకు నిరోధకం- జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మత్తు పదార్థాలు, మద్యపానీయాల వినియోగం యువత భవిష్యత్తుకు నిరోధకమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి జిల్లా పోలీస్, విద్య, వైద్య, అటవీ, వ్యవసాయ, సాంఘిక, ఆదాయ పన్ను, రెవెన్యూ శాఖల అధికారులు, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎన్.సి.బి. ప్రతినిధులతో మత్తు పదార్థాల నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత మద్యానికి, మత్తు పదార్థాలు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మంచి భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో నిషేధించబడిన మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో గంజాయి సాగు జరుగకుండా వ్యవసాయ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో రి-హాబిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెలలో ఒకరోజు ప్రజావాణి కార్యక్రమంలో మత్తు పదార్థాల నియంత్రణ పై సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎ.సి.పి. తిరుపతి రెడ్డి, సి.ఐ. రాజు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చందన, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment