మాసాంతంలోగా సి.ఎం.ఆర్. ప్రక్రియ పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ తో కలిసి అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో సి.ఎం.ఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2021-22 సీజన్ కు సంబంధించి బకాయి ఉన్న సి.ఎం.ఆర్ లక్ష్యాలను ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలని తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి సీజన్ల ధాన్యాన్ని రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా కేటాయించిన లక్ష్యాల సి.ఎం.ఆర్.ను ప్రతి రోజు నివేదిక అందించాలని తెలిపారు. జిల్లాలోని ఆయా మిల్లులకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు 2023-24 వానాకాలం సంబంధించిన ధాన్యం కేటాయింపు జరుగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
246