మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

  • పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కాపులకు టికెట్లు ఇవ్వాలి
  • కార్పొరేషన్ తోనే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య

ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణాలో అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య డిమాండ్ చేశారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణాలో బీసీ జనాభాలో 26 శాతం మున్నూరు కాపులున్నారని, 60 లక్షల మున్నూరు కాపులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని అన్నారు. కాపులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. హైదరాబాద్ కొకాపేటలో మున్నూరు కాపు భవనానికి స్థలం కేటాయించారని, కానీ కేవలం 5 కోట్లు మాత్రమే నిధులు ఇవ్వడం వల్ల సరిపోవడం లేదన్నారు. వెంటనే 20 కోట్లు కేటాయించాలన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో కాపు భవనాలకు 2 ఎకరాల స్థలం, 3 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాపులకు అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు మ్యానిఫెస్టోలో పెట్టాలని కోరారు. ప్రతి జిల్లాలో మున్నూరు కాపు విద్యార్థులకు హాస్టల్లు నిర్మించాలన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహం కల్పించడానికి నిరుద్యోగ యువకులకు రుణాలు అందించి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కాలీగా ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ పదవులు మున్నూరు కాపులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, యూత్ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజీవ్, మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవి, రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్, యూత్ జిల్లా అధ్యక్షుడు సీపతి సురేష్, నాయకులు గొంగల్ల శంకర్, సతీష్, తిరుపతి, ఆరె శ్రీనివాస్, ఆకుల బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

  • పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కాపులకు టికెట్లు ఇవ్వాలి
  • కార్పొరేషన్ తోనే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య

ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణాలో అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య డిమాండ్ చేశారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణాలో బీసీ జనాభాలో 26 శాతం మున్నూరు కాపులున్నారని, 60 లక్షల మున్నూరు కాపులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని అన్నారు. కాపులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. హైదరాబాద్ కొకాపేటలో మున్నూరు కాపు భవనానికి స్థలం కేటాయించారని, కానీ కేవలం 5 కోట్లు మాత్రమే నిధులు ఇవ్వడం వల్ల సరిపోవడం లేదన్నారు. వెంటనే 20 కోట్లు కేటాయించాలన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో కాపు భవనాలకు 2 ఎకరాల స్థలం, 3 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాపులకు అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు మ్యానిఫెస్టోలో పెట్టాలని కోరారు. ప్రతి జిల్లాలో మున్నూరు కాపు విద్యార్థులకు హాస్టల్లు నిర్మించాలన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహం కల్పించడానికి నిరుద్యోగ యువకులకు రుణాలు అందించి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కాలీగా ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ పదవులు మున్నూరు కాపులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, యూత్ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజీవ్, మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవి, రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్, యూత్ జిల్లా అధ్యక్షుడు సీపతి సురేష్, నాయకులు గొంగల్ల శంకర్, సతీష్, తిరుపతి, ఆరె శ్రీనివాస్, ఆకుల బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment