- బిజెపి నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం బిజెపి నస్పూర్ పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ, వివేకానందుని స్ఫూర్తితో యువత అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు అని అన్న స్వామి వివేకానంద మాటలు స్ఫూర్తిగా తీసుకొని లక్ష్య సాధనలో అంకితభావంతో ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని కోరారు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నయువతీ యువకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పబ్బతినేని కమలాకర్ రావు, కేశెట్టి నాగేశ్వరరావు, పోన్నవేని సదయ్య, కుర్ర చక్రవర్తి, కాదస్ భీమయ్య, మద్ది సుమన్, రవణవేణి శ్రీనివాస్, బద్రి శ్రీకాంత్, సత్యనారాయణ, నరేందర్, తిరుపతి, సుజిత్, రవి, రత్నం, రాకేష్, శ్రావణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.