యువ ఉద్యోగులు సింగరేణి పురోభివృద్ధికి కృషి చేయాలి

  •  శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
  •  కారుణ్య నియామక పత్రాలు అందజేత

నస్పూర్, ఆర్.కె న్యూస్: కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరుతున్న యువ ఉద్యోగులు సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 52 మంది  కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశానికే  తలమానికం అయిన సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి యువతి, యువకులకు ఉపాధి కల్పిస్తుందని అన్నారు. యువ ఉద్యోగులు సర్ఫేస్ లో లైట్ జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా, గైర్హాజరు కాకుండా ఉద్యోగం చేసుకోవాలని, తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ, క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సింగరేణిలో రెండో తరానికి ఉద్యోగాలు రావడం తమ అదృష్టంగా భావించాలని, ఉద్యోగం కల్పించిన తమ తల్లిదండ్రులను, అత్తమామల బాగోగులు చూసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని చెప్పారు. ఉద్యోగులు వృత్తి నైపుణ్యాన్ని సాధించాలని, సీనియర్ ఉద్యోగుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రమాద రహిత సింగరేణికి కృషి చేయాలని కోరారు. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియాలో 3784 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సీనియర్ పీవో పి. కాంతారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

యువ ఉద్యోగులు సింగరేణి పురోభివృద్ధికి కృషి చేయాలి

  •  శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
  •  కారుణ్య నియామక పత్రాలు అందజేత

నస్పూర్, ఆర్.కె న్యూస్: కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరుతున్న యువ ఉద్యోగులు సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 52 మంది  కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశానికే  తలమానికం అయిన సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి యువతి, యువకులకు ఉపాధి కల్పిస్తుందని అన్నారు. యువ ఉద్యోగులు సర్ఫేస్ లో లైట్ జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా, గైర్హాజరు కాకుండా ఉద్యోగం చేసుకోవాలని, తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ, క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సింగరేణిలో రెండో తరానికి ఉద్యోగాలు రావడం తమ అదృష్టంగా భావించాలని, ఉద్యోగం కల్పించిన తమ తల్లిదండ్రులను, అత్తమామల బాగోగులు చూసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని చెప్పారు. ఉద్యోగులు వృత్తి నైపుణ్యాన్ని సాధించాలని, సీనియర్ ఉద్యోగుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రమాద రహిత సింగరేణికి కృషి చేయాలని కోరారు. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియాలో 3784 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సీనియర్ పీవో పి. కాంతారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment