- మహిళా ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం
- సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరాం అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7, ఆర్.కె న్యూటెక్, ఆర్.కె 6, ఆర్.కె 5, ఎస్సార్పీ సి.హెచ్.పి, ఎస్సార్పీ ఓసీపీలను డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు వారికి కేటాయించిన విధులు తప్పనిసరిగా ఎనిమిది గంటల సమయంలో నిర్వర్తించాలని, గైర్హాజరు లేకుండా విధులు నిర్వర్తిస్తూ నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేయాలని, భారీ యంత్రాల వినియోగ సమయం పెంచాలని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సంస్థ కలిపిస్తుందని, మహిళా ఉద్యోగులు వివిధ కేటగిరీలలో భూగర్భంలో విధులు నిర్వర్తిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకతకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. మహిళ ఉద్యోగులకు ఈపి ఆపరేటర్లుగా వెళ్లడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధన దిశగా ప్రతి ఒక్క ఉద్యోగి ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ కె. రాజేందర్, ఆర్.కె 5, 6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, డిజిఎం (పర్సనల్) పి. అరవింద రావు, ఆర్.కె న్యూ టెక్ గని మేనేజర్ స్వామి రాజు, సి. హెచ్.పి ఇన్చార్జి డిజిఎం చంద్ర లింగం, ఆర్.కె 7 గని మేనేజర్ తిరుపతి, ఆర్.కె 6 గని మేనేజర్ ఈ. తిరుపతి., ఆర్.కె 5 గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, సీనియర్ పీవో పి. కాంతారావు, గుర్తింపు సంఘం యూనియన్ నాయకులు ముష్క సమ్మయ్య, వీరభద్రయ్య, వివిధ గనుల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.