– మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాజకీయాలకు అతీతంగా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. గురువారం నస్పూర్ మున్సిపాలిటీలోని 19, 14, 22, 13, 24, 25, 15 వార్డుల్లో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా ప్రజలకు ప్రేమ్ సాగర్ రావు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని అన్నారు. వరదల సమయంలో అధికారులు ఎవరూ స్పందించకపోయినా తాము స్పందించామన్నారు. ఎండాకాలంలో ప్రజలకు నీటి ఎద్దడి తీర్చేందుకు వాటర్ ట్యాంకుల ద్వారా గోదావరి నీటిని అందించామన్నారు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు సైతం కరోనా, వరద ప్రభావిత సమయాల్లో పారిపోతే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు సేవలు అందించారని గుర్తు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ సాగర్ రావు ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.