రాబోయే ఎన్నికల్లో మున్నూరు కాపులు సత్తా చాటాలి

  • మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారాం
  • మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

ఆర్.కె న్యూస్, నస్పూర్: రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీసీలు, మున్నూరు కాపులు ఐక్యతతో సత్తా చాటాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీపతి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2025 క్యాలెండర్ ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తోట శ్రీనివాస్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపులు ఉన్నారని చెప్పారు. బీసీలు రాష్ట్రంలో 56 శాతం ఉన్నారని, అందులో 18 శాతం మున్నూరు కాపులు ఉన్నారని పేర్కొన్నారు. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపులు ఐఖ్యతోనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో కాపు ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి బాపురావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరెండ్ల శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, పట్టణ సమన్వయ కమిటీ సభ్యుడు మైదం రామకృష్ణ, పెంచాల వేణు, గుడాల మల్లేషం, ధర్ని మధూకర్, నాయకులు పడాల రవిందర్, వార్డు కన్వీనర్లు గాండ్ల ఆంజయ్య, పానగంటి సత్తయ్య, ఆకుల నరేందర్, ఆకుల లక్ష్మన్, రాళ్లబండి రాజన్న, గుమ్మడి తిరుపతి, అడె మధూకర్, సీపతి సదయ్య, అగ్గు సాగర్, పొగాకు రమేశ్, పెద్దపల్లి రామయ్య, రుకుం తిరుమల్, ఆకుల నరేందర్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

రాబోయే ఎన్నికల్లో మున్నూరు కాపులు సత్తా చాటాలి

  • మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారాం
  • మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

ఆర్.కె న్యూస్, నస్పూర్: రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీసీలు, మున్నూరు కాపులు ఐక్యతతో సత్తా చాటాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీపతి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2025 క్యాలెండర్ ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తోట శ్రీనివాస్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపులు ఉన్నారని చెప్పారు. బీసీలు రాష్ట్రంలో 56 శాతం ఉన్నారని, అందులో 18 శాతం మున్నూరు కాపులు ఉన్నారని పేర్కొన్నారు. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపులు ఐఖ్యతోనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో కాపు ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి బాపురావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరెండ్ల శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, పట్టణ సమన్వయ కమిటీ సభ్యుడు మైదం రామకృష్ణ, పెంచాల వేణు, గుడాల మల్లేషం, ధర్ని మధూకర్, నాయకులు పడాల రవిందర్, వార్డు కన్వీనర్లు గాండ్ల ఆంజయ్య, పానగంటి సత్తయ్య, ఆకుల నరేందర్, ఆకుల లక్ష్మన్, రాళ్లబండి రాజన్న, గుమ్మడి తిరుపతి, అడె మధూకర్, సీపతి సదయ్య, అగ్గు సాగర్, పొగాకు రమేశ్, పెద్దపల్లి రామయ్య, రుకుం తిరుమల్, ఆకుల నరేందర్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment