రామకృష్ణాపూర్, ఆర్.కె న్యూస్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రేపు జాతీయ ఏక్తా దివాస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీసులు “రన్ ఫర్ యూనిటీ” (2కే రన్)ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఠాగూర్ స్టేడియం నుంచి రామాలయం ఏరియా వరకు 2కే రన్ జరుగుతుంది. పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పట్టణ ఎస్సై రాజశేఖర్ పిలుపునిచ్చారు.
49





