మంచిర్యాల జిల్లాలోని ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కె.వై.సి చేయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ తమ వివరాలు చౌకధరల దుకాణాలకు వెళ్లి తప్పనిసరిగా ఈ-కె.వై.సి. చేయించుకోవాలని, ఈ మేరకు రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు లోని ప్రతి లబ్దిదారుడి వేలిముద్రలు, వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 2 లక్షల 3 వేల ఆహార భద్రత కార్డులలో 5 లక్షల 92 వేల మంది లబ్దిదారులకు 29 వేల 782 క్వింటాళ్ళు, 15 వేల 490 అంత్యోదయ కార్డులలో 47 వేల 880 మంది లబ్దిదారులకు 4 వేల 975 క్వింటాళ్ళు, 160 అన్నపూర్ణ అన్న యోజన కార్డులలో 161 మంది లబ్దిదారులకు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు.
242