లాభాల్లో కార్మికులకు వాటా హక్కు సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుంది

  • నిజాయితీగల అధికారులను వేధింపులకు గురి చేయడం సరికాదు  
  • తమ మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్న కొన్ని కార్మిక సంఘాలు 
  • ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా పంపిణీ చేసే హక్కు సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం ఏరియాలోని ఆర్.కె 5 గని పై నిర్వహించిన సమావేశానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన హాజరై మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ, సంస్థ మనుగడ కోసం ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని అన్నారు. 1999లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన 13 రోజుల సమ్మె తర్వాత నాటి టీడీపీ ప్రభుత్వం కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తానని ఒప్పుకోవడం జరిగిందని, ఆనాడు 10 శాతంగా మొదలైన లాభాల వాటా నేటికి 33 శాతం అయిందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు వచ్చిన స్థూల లాభం ప్రకటించి కంపెనీ అభివృద్ధి, కంపెనీ విస్తరణ కోసం కొంత మొత్తాన్ని మినహాయించి మిగిలిన నికర లాభం నుంచి 33 శాతం చెల్లించడం జరిగిందని, ఈ విషయంపై అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీని విమర్శించడం అర్ధరాహిత్యమని, కార్మికుల్లో ఏఐటీయూసీ పై ఉన్న ఆదరణ చూడలేక వారి మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్నారని అన్నారు. రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థ నష్టపోయే ప్రమాదం ఉందని, సింగరేణిలో నిజాయితీగల అధికారులను యాజమాన్యం వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగారావు, సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, నాయకులు మల్లేష్, భోగ మధునయ్య, జిపి రావు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

లాభాల్లో కార్మికులకు వాటా హక్కు సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుంది

  • నిజాయితీగల అధికారులను వేధింపులకు గురి చేయడం సరికాదు  
  • తమ మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్న కొన్ని కార్మిక సంఘాలు 
  • ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా పంపిణీ చేసే హక్కు సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం ఏరియాలోని ఆర్.కె 5 గని పై నిర్వహించిన సమావేశానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన హాజరై మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ, సంస్థ మనుగడ కోసం ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని అన్నారు. 1999లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన 13 రోజుల సమ్మె తర్వాత నాటి టీడీపీ ప్రభుత్వం కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తానని ఒప్పుకోవడం జరిగిందని, ఆనాడు 10 శాతంగా మొదలైన లాభాల వాటా నేటికి 33 శాతం అయిందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు వచ్చిన స్థూల లాభం ప్రకటించి కంపెనీ అభివృద్ధి, కంపెనీ విస్తరణ కోసం కొంత మొత్తాన్ని మినహాయించి మిగిలిన నికర లాభం నుంచి 33 శాతం చెల్లించడం జరిగిందని, ఈ విషయంపై అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీని విమర్శించడం అర్ధరాహిత్యమని, కార్మికుల్లో ఏఐటీయూసీ పై ఉన్న ఆదరణ చూడలేక వారి మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్నారని అన్నారు. రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థ నష్టపోయే ప్రమాదం ఉందని, సింగరేణిలో నిజాయితీగల అధికారులను యాజమాన్యం వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగారావు, సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, నాయకులు మల్లేష్, భోగ మధునయ్య, జిపి రావు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment