ఇంటర్నెట్ లీడ్ పేర్లతో మాయమాటలు చెబుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బియ్యాల ప్రశాంత్ అన్నారు. విద్యా అర్హత లేని టీచర్లతో పాఠశాల నిర్వహిస్తున్నారని, స్కూల్ లో బుక్స్, షూస్, సాక్స్, బెల్టు, ఐడి కార్డులను అమ్ముతున్న అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను తుంగలో తొక్కుతున్న లోటస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేనియెడల అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాధికారి కార్యాలయం ముట్టడికి వెనకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాజు, ప్రశాంత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
245